HomeTelanganaబయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్...!

బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్…!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి న్యూఢిల్లీలో కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామిని కలిసి బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ (Green Steel Plant) ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. పర్యావరణానికి మేలు చేయడంతో పాటు దేశంలో ఉన్న ఉక్కు కొరతను తగ్గించడానికి ఈ ప్లాంట్ ఎంతగానో ఉపయోగపడుతుందని సీఎం వివరించారు.

ఈ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్‌లో భాగంగా కేంద్ర మంత్రులకు సమర్పించారు. పాత వాహనాల స్క్రాప్ (Scrap) నుండి ఉక్కును రీసైక్లింగ్ చేసే పరిశ్రమను తెలంగాణలో ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాద్‌లో హైడ్రోజన్ టెక్నాలజీతో కూడిన గ్రీన్ స్టీల్ క్లస్టర్, ఆటో, రక్షణ రంగాల ఉత్పత్తుల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న దృష్ట్యా ఈవీ (EV) బ్యాటరీ తయారీ కేంద్రం మరియు అడ్వాన్స్‌డ్ మాన్యుఫాక్చరింగ్ (రోబోటిక్స్ వంటివి) కోసం ప్రత్యేక పార్కును ఏర్పాటు చేయాలని విన్నవించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments