HomeTelanganaబిగ్ బ్రేకింగ్: రుణమాఫీ కాని అర్హులైన రైతులకు రుణమాఫీ...!

బిగ్ బ్రేకింగ్: రుణమాఫీ కాని అర్హులైన రైతులకు రుణమాఫీ…!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో ధాన్యపు కొనుగోలు నిధులను జమ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏప్రిల్ 2026లో ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేసిన వారం రోజుల్లోనే ఆ నగదును నేరుగా రైతుల ఖాతాల్లో (DBT) జమ చేస్తున్నామని మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సుమారు 25 లక్షల మంది రైతులకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీని పూర్తి చేసి, సుమారు ₹20,616 కోట్లను జమ చేసింది.

సాంకేతిక కారణాలు లేదా ఇతర సమస్యల వల్ల రుణమాఫీ కాని అర్హులైన రైతుల వివరాలను పరిశీలించి, వారికి కూడా న్యాయం చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. సన్న వడ్లకు క్వింటాలుకు ₹500 బోనస్ అందిస్తున్నామని, అలాగే ధరణి పోర్టల్ స్థానంలో ‘భూ భారతి’ని తీసుకువచ్చామని మంత్రి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని, రుణమాఫీ మరియు రైతు భరోసా వంటి పథకాలను ప్రాధాన్యత క్రమంలో అమలు చేస్తోందని ఆయన స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments