HomeTelanganaఆసుపత్రులలో జనరేటర్లను సిద్ధంగా ఉంచుకోండి...!

ఆసుపత్రులలో జనరేటర్లను సిద్ధంగా ఉంచుకోండి…!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో:ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో విద్యుత్ కోతలను తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించింది.ముఖ్యంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఏప్రిల్ 15, 2026న నిర్వహించిన సమీక్షా సమావేశంలోసూచనలు చేశారు. ఆసుపత్రులలోని జనరేటర్లు పని చేసే స్థితిలో ఉన్నాయో లేదో తనిఖీ చేయాలని, అవసరమైతే వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.

విద్యుత్ సరఫరా నిలిచిపోయిన వెంటనే ఆటోమేటిక్ బ్యాకప్ సిస్టమ్‌లు పని చేసేలా చూసుకోవాలని, తద్వారా రోగులకు అందించే వైద్య సేవలకు అంతరాయం కలగకుండా చూడాలని స్పష్టం చేశారు.ఎండల దృష్ట్యా ఆసుపత్రులలో తగినంత తాగునీరు, ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.అధిక వేడి వల్ల పెరిగిన విద్యుత్ డిమాండ్, వడగళ్ల వానలు లేదా బలమైన గాలుల వల్ల అకస్మాత్తుగా సరఫరాలో అంతరాయాలు కలిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎండల వల్ల అప్రకటిత విద్యుత్ కోతలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నట్లు నివేదికలు అందుతున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments