HomeTelanganaఆర్టీసీ సమ్మె కొనసాగింపు...నేడు రెండు దశల్లో చర్చలు

ఆర్టీసీ సమ్మె కొనసాగింపు…నేడు రెండు దశల్లో చర్చలు

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె నేడు (ఏప్రిల్ 24, 2026) మూడవ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రతిష్టంభనను తొలగించేందుకు ప్రభుత్వం నేడు సచివాలయంలో కార్మిక సంఘాల నేతలతో రెండు దశల్లో చర్చలు జరపనుంది.

మొదటి దశ: ఉదయం 10:00 గంటలకు సీనియర్ ఐఏఎస్ అధికారులు వికాస్ రాజ్, దానకిషోర్, సందీప్ సుల్తానియాలతో ఆర్టీసీ జేఏసీ (JAC) నేతలు భేటీ అవుతారు.

రెండవ దశ: అనంతరం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల బృందం (రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సహా) కార్మిక నేతలతో చర్చలు జరుపుతారు.
ప్రభుత్వ పిలుపు మేరకు జేఏసీ నేతలు ఇప్పటికే ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో అత్యవసరంగా సమావేశమై, చర్చల కోసం సచివాలయానికి బయలుదేరారు.

ప్రధాన డిమాండ్లు:
కార్మికులు మొత్తం 32 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచగా, వాటిలో ప్రధానంగా మూడు కీలక అంశాలపై ఏకాభిప్రాయం కుదరాల్సి ఉంది.
ఆర్టీసీని ప్రభుత్వంలో పూర్తిస్థాయిలో విలీనం చేయడం.
గుర్తింపు సంఘాల కోసం వెంటనే ఎన్నికలు నిర్వహించడం.
మహాలక్ష్మి పథకం కోసం అదనపు బస్సులతో పాటు, కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి నిర్వహించడం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments