HomeTelanganaBreaking: ఆర్టీసీ సమ్మె ప్రారంభం...బస్సులు బంద్...!

Breaking: ఆర్టీసీ సమ్మె ప్రారంభం…బస్సులు బంద్…!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) కార్మికుల సమ్మె నేటి (ఏప్రిల్ 21, 2026) అర్ధరాత్రి నుంచే ప్రారంభం కానుంది. ఆర్టీసీ జేఏసీ (JAC) పిలుపు మేరకు ఏప్రిల్ 22వ తేదీ తెల్లవారు జామున మొదటి సర్వీస్ నుంచే బస్సులు నిలిచిపోనున్నాయి.

ఆర్టీసీని ప్రభుత్వంలో పూర్తిస్థాయిలో విలీనం చేయాలి, 2021 పీఆర్సీని అమలు చేయాలి, కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించాలి మరియు బకాయి ఉన్న పీఎఫ్, సీసీఎస్ నిధులను విడుదల చేయాలి అనేవి వీరి 32 ప్రధాన డిమాండ్లు. ప్రభుత్వం మరియు లేబర్ కమిషనర్‌తో జరిపిన చర్చలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో సమ్మె బాట పట్టక తప్పలేదని జేఏసీ నేతలు ప్రకటించారు.

ఆర్టీసీ జేఏసీతో పాటు పలు ఇతర కార్మిక సంఘాలు కూడా ఈ సమ్మెకు సంఘీభావం తెలిపాయి. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు సమ్మెను విరమించాలని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుందామని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. విలీనం వంటి అంశాలు ఇప్పటికే పరిశీలనలో ఉన్నాయని పేర్కొన్నారు.

ఈ సమ్మె వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6,000 బస్సులు రోడ్డెక్కే అవకాశం లేకపోవడంతో సామాన్య ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments