HomeCrimeహైదరాబాద్‌: కేబుల్ బ్రిడ్జి పై ఘోర ప్రమాదం...ఒకరు మృతి...!

హైదరాబాద్‌: కేబుల్ బ్రిడ్జి పై ఘోర ప్రమాదం…ఒకరు మృతి…!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: హైదరాబాద్‌లోని దుర్గం చెరువు (మాదాపూర్) కేబుల్ బ్రిడ్జిపై ఆదివారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. మృతుడిని న్యూ హఫీజ్‌పేట్‌కు చెందిన 32 ఏళ్ల వ్యాపారవేత్త శ్యామ్ రాజ్ (Gosa Shyam Raj) గా గుర్తించారు. ఆదివారం తెల్లవారుజామున సుమారు 3:15 గంటలకు శ్యామ్ రాజ్ తన భార్య సహజతో కలిసి బైక్‌పై కేబుల్ బ్రిడ్జి వద్దకు వచ్చారు.

భార్య నడక దారి (walkway) పై ఉండగా, శ్యామ్ రాజ్ రోడ్డుపై నిలబడి ఆమెను ఫోటోలు తీస్తున్న సమయంలో జూబ్లీహిల్స్ వైపు నుండి అతివేగంగా వచ్చిన ఒక బెంజ్ కారు అతడిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్యామ్ రాజ్‌ తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని సమీపంలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో మరణించాడు.

ప్రమాదానికి కారణమైన బెంజ్ కారు పశ్చిమ బెంగాల్ రిజిస్ట్రేషన్ (WB 06 B 7003) కలిగి ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ కారును అక్కడే వదిలేసి పారిపోయాడు. ఈ కారు బెంగళూరుకు చెందిన క్వాంటం మినరల్స్ అండ్ మెటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రిజిస్టర్ అయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

మృతుడి భార్య ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. కేబుల్ బ్రిడ్జిపై వాహనాలు ఆపడం మరియు ఫోటోలు దిగడం ప్రమాదకరమని పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments