Homeలైఫ్ స్టైల్రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా?.. ఈ తప్పులు చేస్తే అది విషమే!

రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా?.. ఈ తప్పులు చేస్తే అది విషమే!

రాగి పాత్రలో నిల్వ చేసిన నీరు ఆరోగ్యానికి మేలు చేస్తుందనే విశ్వాసం చాలా కాలంగా కొనసాగుతోంది. రోగనిరోధక శక్తిని పెంచడం, జీర్ణక్రియను మెరుగుపరచడం వంటి ప్రయోజనాలు కలిగిస్తుందని భావిస్తూ చాలా మంది ఈ అలవాటును అనుసరిస్తున్నారు. అయితే నిపుణుల ప్రకారం.. రాగి నీటిని సరైన విధంగా, పరిమితంగా తీసుకోకపోతే అది ప్రయోజనానికి బదులుగా ప్రమాదాన్ని కలిగించే అవకాశముంది. రాగి శరీరానికి అవసరమైన ఖనిజమే అయినప్పటికీ, దాన్ని అతిగా తీసుకోవడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల రోజంతా రాగి పాత్రలోని నీటినే తాగడం ఆరోగ్యానికి మంచిదికాదని సూచిస్తున్నారు.

ఇంకా ముఖ్యంగా రాగి పాత్రలో కొన్ని పదార్థాలను ఉంచడం పూర్తిగా తప్పు. నిమ్మరసం, వెనిగర్, పెరుగు, మజ్జిగ వంటి పుల్లటి పదార్థాలను రాగి పాత్రలో నిల్వ చేయడం వల్ల రాగిలోని లోహం ఆ యాసిడ్లతో చర్యకి లోనై హానికరమైన పదార్థాలను విడుదల చేస్తుంది. ఇవి శరీరంలోకి వెళ్లినప్పుడు ఆహార విషబాధకు దారితీయవచ్చు. అలాగే రాగి పాత్రల లోపల భాగం నల్లగా లేదా ఆకుపచ్చగా మారితే వాటిని వాడటం చాలా ప్రమాదకరం. ఆ ఆకుపచ్చ పొర శరీరంలోకి చేరితే కడుపు నొప్పి, వాంతులు వంటి సమస్యలు తీవ్రంగా కలిగే అవకాశం ఉంది.

రాగి పాత్రలోని నీటిని తాగే సరైన పద్ధతి కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. రాత్రి సమయంలో రాగి పాత్రలో నీటిని నింపి ఉంచి, ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో ఒక గ్లాసు తాగడం ఉత్తమం. ఇలా తాగడం వల్ల శరీరానికి అవసరమైన మినరల్స్ అందుతాయి. అయితే రోజుకు 1 లేదా 2 గ్లాసులకు మించి తీసుకోకపోవడం మంచిదని సూచిస్తున్నారు. దీనితో పాటు రాగి పాత్రలను పరిశుభ్రంగా ఉంచడం చాలా అవసరం. తరచుగా నిమ్మకాయ లేదా చింతపండుతో శుభ్రం చేస్తూ లోపలి భాగం మెరుస్తూ ఉండేలా చూసుకోవాలి. సరైన పద్ధతిలో వాడితే రాగి నీరు ఒక ఔషధంలా పనిచేస్తుంది. కానీ పరిమితి దాటితే అదే ఆరోగ్యానికి హానికరంగా మారే అవకాశం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ALSO READ: 747 కోట్ల సినిమా.. థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఓటీటీలో ట్రెండింగ్

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments